బిగ్ బ్రేకింగ్ : ఇండియాలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా.. గత 24 గంటల్లో కొత్తగా 22,252 కరోనా కేసులు నమోదవ్వగా, 467 మంది మరణించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరుకుంది. ఇందులో ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 20,160 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,59,557 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. అలాగే రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news