10 వేల మరణాలకు చేరువ.. భారత్ లో కలకలం..!

-

భారత్ లో కరోనా తీవ్రత వేగంగా వ్యాపిస్తుంది. మొదట్లో అంతా మన కంట్రోల్లోనే ఉంది అనుకున్నాం.. కానీ, రోజులు మారుతున్న కొద్ది కోరోనా కంట్రోల్లోకి మనం వెళ్లిపోయాం. దీంతో రోజుకి వేల కేసులతో పాటు వందల మరణాలు కూడా సంతరించుకున్నాయి. కాగా, కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,502 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 325 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,32,424 చేరగా, మృతుల సంఖ్య మొత్తం  9,520కి పెరిగింది. 1,53,106 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,69,798 మంది కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news