భారత్ లో కరోనా భీభత్సం.. రికార్డు స్థాయిలో మరణాలు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో 64,531 మందికి కొత్తగా కరోనా సోకగా..1,092 మంది మ‌ర‌ణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 27,67,274కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 52,889కి పెరిగింది. ప్రస్తుతం 6,76,514 మంది కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,37,871 మంది కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news