రాజధానిలో కరోనా కలకలం..! ఒక్కరోజులో 29 మరణాలు..!

-

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు. కాగా, తాజాగా.. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 1093 కరోనా కేసులు నమోదవ్వగా, 29 మంది మరణించారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,34,403కు చేరింది. ఢిల్లీలో ఇప్పటివరకు 3,936 మంది మరణించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 1,19,724 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,743 యాక్టివ్ కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news