తెలంగాణలో అలా.. ఆంధ్రాలో ఇలా..? తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం..!

-

తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 20,245 శాంపిల్స్ పరీక్షించగా మరో 2,602 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,646కు చేరింది. గడచిన 24 గంటల్లో 42 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 534కి చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకు 20,298 మంది కోలుకోగా మరో 19,814 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

అలాగే తెలంగాణలో కూడా గత 24 గంటల్లో కొత్తగా 1,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 మంది ప్రాణాలు కోల్పోయారు. 1410 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,496కి చేరింది. మొత్తం 403 మంది మరణించారు. కరోనాతో ఇప్పటివరకూ కోలుకుని 28,705 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,389 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news