వణుకుతున్న గోదావరి తీరం, బిక్కు బిక్కు మంటూ ప్రజలు…!

-

ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా తీవ్రత రోజు రోజుకి ఆందోళన కలిగిస్తుంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టామని అధికారులు చెప్పినా… పరిస్థితి అదుపులోకి రావడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణంగా పరిస్థితి ఉంది. జిల్లాలో 46వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు… నిన్న ఒక్క రోజే కొత్తగా 1321 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఎనిమిది మంది మృతి చెందారు.

coronavirus
coronavirus

భీమవరంలో భారీగా పెరుగుదల కనపడుతుంది. నిన్న ఒక్కరోజే 180 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏలూరులో 49 కేసులు నమోదు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 46 వేల 184కి చేరింది కరోనా కేసుల సంఖ్య. ఇప్పటి వరకు 348 మంది మృతి చెందరు. కొత్తగా కేసులు నమోదైన 10 ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసారు. 65 చోట్ల ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news