పుట్టగొడుగులతో కరోనాను జయించవచ్చా…!

-

కరోనాకు విరుగుడుగా మష్రూమ్స్‌ పని చేస్తాయా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. కరోనా వైరస్‌ను అంతం చేయడానికి పుట్టగొడుగుల్ని మించిన ఆహారం లేదంటున్నారు హైదరాబాద్‌కి చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు. పుట్టగొడుగులపై తాము చేసిన పరిశోధనలో ఈ విషయం నిర్ధారణైందంటున్నారు.

పుట్టగొడుకుల్లో పోష‌క పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వాటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని అనేక అధ్యయనాల్లో తేలింది. వీటిలో విట‌మిన్ B,Dతో పాటు శరారీనికి అవసరమైన పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. మష్రూమ్‌లను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఫలితంగా ఊబకాయం త‌గ్గడంతో పాటు మ‌ధుమేహంతో పాటు ప్రాణాంతకమైన క్యాన్సర్ల నుంచి ఉప‌శ‌మ‌నం లభిస్తుందని పలు అధ్యయనాల ద్వారా గుర్తించారు. ప్రస్తుతం యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి సైతం పుట్టగొడుగులు ఉపయోగపడతాయని హైద‌రాబాద్‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ సెల్యూల‌ర్ అండ్ మాలిక్యూల‌ర్ బ‌యాల‌జీ – CCMB చెబుతోంది.

పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అలాగే, బీటా గ్లూకాన్స్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంగా తీసుకుంటే… కరోనాకు చెక్ పెట్టొచ్చంటున్నారు CCMB పరిశోధనకులు. పుట్టగొడుగులతో తయారు చేసిన ఆహార పదార్థాలు… కరోనా వైరస్‌కు తక్షణ విరుగుడుగా ఉపయోగపడతాయని తమ పరిశోధల ద్వారా తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news