‘యానిమల్’ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయా: రష్మిక మందన్నా

-

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటించింది. అయితే ఈ మూవీ సక్సెస్ గురించి రష్మీక స్పందిస్తూ… కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న కారణంగా ‘యానిమల్’ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేయలేకపోయానని నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలిపారు. ‘యానిమల్ విడుదల అయిన మరుసటి రోజే వేరే సినిమా షూటింగ్లో పాల్గొన్నా. అందుకే సక్సెస్ మీట్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొనలేకపోయా అని తెలిపారు. కొన్ని ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో నటిస్తున్నా. అవి అభిమానులను అలరిస్తాయి అని ధీమా వ్యక్తం చేసింది. వాటిని చూసి వారు ఎంజాయ్ చేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా’ అని ఆమె చెప్పారు.

 

ఇక ఈ సినిమాలో బాబి డియోల్, అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైన యానిమల్ చిత్రం 900 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. అంతే కాకుండా ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా రిపబ్లిక్ డే కానుకగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి స్పందనను ప్రేక్షకుల నుంచి రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news