ఇండియాలో కొత్తగా 17092 కరోనా కేసులు, 29 మరణాలు

-

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 17092 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,86,326 కు చేరింది.


ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,09,568 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.11 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 29 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,25,168 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 14, 684 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,28,51,590 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,97,84,80,015 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 9,09,776 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news