జగన్‌ ప్రభుత్వం వచ్చే ఏడాది కూలబోతుంది – సిపిఐ నారాయణ

-

జగన్‌ ప్రభుత్వం వచ్చే ఏడాది కూలబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ నారాయణ. విశాఖపట్నం సీల్ట్ ప్లాంట్ ను బిజెపి డంపింగ్ యార్డ్ గా మార్చబోతోంది…మోది హాటావో…దేశ్ బచావో నినాదంతో త్వరలో సిపిఐ అధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని వెల్లడించారు. జనం మద్దతు ఉంటే ఎందుకు పోలీసుల వలయంలో తిరుగుతున్నావ్ జగన్…ఎందుకు అంతా భయం అని ఫైర్‌ అయ్యారు సిపిఐ నారాయణ.

కుటుంబ సభ్యులతో కూడా స్వేచ్ఛ గా తిరిగలేని జగన్… ప్రతిపక్ష పార్టీలకు మాత్రం సవాల్ విసురుతున్నాడు..మోది…జగన్ ది నియంత పాలనా…వీరివల్ల రాష్ట్ర నాశనం అవుతోందన్నారు. ఎవరు ఎలా పోటి చేయాలో జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది…వైసిపికి ఉండెది ఒక సంవత్సవం ఆయుస్సు ఉందని తెలిపారు సిపిఐ నారాయణ.విశాఖ పట్నం సమ్మిట్ లో 13 లక్షల కోట్ల వచ్చాయాంటె హాస్యాస్పదంగా ఉంది…అవన్నీ కాకి లెక్కలన్నారు. పారిశ్రామిక కంపెనీలను తరిమేసి ఇప్పుడు పెట్టుబడులంటే ఎలా…మూడు రాజధానులు అన్నప్పుడు ఏపీపై పారిశ్రానిక వేత్తలకు నమ్మకం పోయిందని చురకలు అంటించారు సిపిఐ నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news