నెదర్లాండ్స్‌తో టీమ్ ఇండియా మ్యాచ్‌లో ఇంట్రెస్టింగ్ పోస్టర్

-

రన్‌ మెషీన్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరాట్‌ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ లో ఫుల్ జోష్ చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఇండియా విజయంలో కీలక పాత్ర వహించాడు. జోరుగా తన ఆటని సాగిస్తూ టీమ్ ఇండియాను గెలిపించాడు. రెండు మ్యాచుల్లో కోహ్లీ ఆట తీరుపై అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించిన కోహ్లీ.. ఇవాళ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు.

నెదర్లాండ్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ దర్శనమిచ్చింది. కోహ్లీ ఫ్యాన్ ఒకరు ప్రదర్శించిన పోస్టర్ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆట జరుగుతుండగా ఓ ఫ్యాన్‌ ప్రదర్శించిన పోస్టర్‌ను బిగ్‌ స్క్రీన్‌పై చూపడంతో మ్యాచ్‌ తిలకిస్తున్న వారంతా ఒక్కసారిగా ఆ పోస్టర్ పై ఫోకస్ చేశారు. తన అభిమాన క్రికెటర్‌ను అందనంత ఎత్తులో ఉంచాలనుకుని ‘రోబో చిట్టి + క్రిష్‌ + బాహుబలి = కింగ్‌ కోహ్లీ’ అని ఫొటోలు అతికించిన పోస్టర్‌ తయారు చేశారు. ఈ పోస్టర్‌ను చూసిన కోహ్లీ కూడా ముసిముసిగా నవ్వుకోవడం కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news