హాట్ కేకుల్లా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు…. 5 నిమిషాల్లోనే బుకింగ్స్ పూర్తి

-

ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దాయాదులు ఇద్దరు మరోసారి తలపడేందుకు ఈసారి ఆస్ట్రేలియా వేదిక కానుంది. గతేడాది దుబాయ్ లో టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇండియా, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లోె ఇండియా 10 వికేట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. కేవలం సంవత్సరం వ్యవధిలోనే మరోసారి ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి.

ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ జరుగనుంది. ఈ ఏడాది అక్టోబర్ 16 మరియు నవంబర్ 13 మధ్య ఏడు వేదికల్లో వివిధ జట్ల మధ్య మ్యాచులు జరుగనున్నాయి. అక్టోబర్ 23న ఇండియా,పాకిస్తాన్ మధ్య మెల్ బోర్న్ వేదికగా రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి సోమవారం టికెట్ల విక్రయాలు కేవలం 5 నిమిషాల్లోనే పూర్తయ్యాయి. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడయ్యాయి. 2015లో సిడ్నీ వేదికగా ఈ రెండు జట్లు ఆస్ట్రేలియాలో తలపడ్డాయి. ఆ సమయంలో టికెట్లు కేవలం నిమిషం వ్యవధిలోనే అమ్ముడయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news