ఒంగోలులో దారుణం..మహిళను పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్‌ రేప్‌

-

ఏపీలోని ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్‌ రేప్‌ చేశారు. కొప్పోలు సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళను అడ్డగించి అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న మహిళ నిర్మానుష్య ప్రదేశంలోకి రాగానే ఆమె వాహనాన్ని ఢీకొట్టిన యువకులు.. మహిళ కింద పడగానే పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు.

ఇక కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పిన మహిళ.. దాడి నుండి తేరుకుని రెండు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు చేపల చెరువుల వద్ద కాపలాగా పనిచేస్తున్న యువకులే నిందితులని గుర్తించారు. ప్రస్తుతం యువకులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అటు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news