ఆంటీతో రాసలీలలు.. యువకుడికి అక్కడ రక్త స్రావం, అంతలోనే !

-

ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… రాజేంద్రనగర్ కు చెందిన రాకేష్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఆత్మహత్య చేసుకోవాలని.. కత్తి తో రెండు చేతుల మణికట్టు కోసుకున్నాడు యువకుడు. అయితే… తీవ్ర రక్త స్రావం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అత్తాపూర్ పాండు రంగ నగర్ కు చెందిన ఓ వివాహిత తో గత కొంత కాలంగా అక్ర సంబంధం పెట్టుకున్నాడు రాకేష్.

భర్త తో దూరంగా ఉంటూ…..రాకేష్ తో వివాహేతర సంబంధం కొనసాగించింది ఆ మహిళ. ప్రేమిస్తున్నానంటూ నమ్మించి, మహిళ నుంచి విడతల వారీగా 90 వేల రూపాయలు వసూల్ చేశాడు రాకేష్‌. తాజాగా వివాహిత కుటుంబ సభ్యులకు అక్రమ సంబంధం ఈ వ్యవహారం తెలిసింది. దీంతో ఇద్దరినీ పిలిచి మందలించారు కుటుంబ సభ్యులు. వివాహిత వద్ద తీసుకున్న 90 వేల రూపాయలు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.

అందుకు నెల రోజుల్లో డబ్బులు చెల్లించాలని బాండ్ పేపర్ పై సంతకం తీసుకున్నారు మహిళ కుటుంబ సభ్యులు. వివాహిత కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరగడంతో తాజాగా ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు యువకుడు. కేసులు పెడతామంటూ వివాహిత కుటుంబ సభ్యుల బెదిరింపులతోనే తన తమ్ముడు ఆత్మహత్య యత్నం చేసాడని రాకేష్ అక్క ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news