రెబల్ స్టార్ ప్రభాస్ కాలికి సర్జరీ..

-

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడట. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ వెల్లడించాడు. ప్రాజెక్ట్‌ కె సినిమా గురించి గురువారం మీడియాతో మాట్లాడిన ప్రభాస్ సీతారామం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ప్రభాస్‌ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ కాలి సర్జరీ కోసం విదేశంలో ఉండటంతో రాలేకపోయాడు అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రభాస్‌కు గతంలోనూ సర్జరీ జరిగినట్లు వార్తలు విచ్చిన విషయం తెలిసిందే!


ఇక ప్రాజెక్ట్‌ కెను వచ్చే ఏడాది అక్టోబర్‌ 18న ప్లాన్‌ చేయాలని భావిస్తున్నట్లు అశ్వినీదత్‌ పేర్కొన్నాడు. ఒకవేళ అప్పటికి కుదరకపోతే 2024 జనవరిలో రిలీజ్‌ చేస్తామని వెల్లడించాడు. చైనా, అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని పాన్​ వరల్డ్​ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్​కు సీక్వెల్​ కూడా ఉండొచ్చని, ‘అవెంజర్స్’​ తరహాలో దీన్ని తెరకెక్కించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభాస్​ పాత్ర టెర్రిఫిక్​గా ఉంటుందని, అక బాలీవుడ్​ బిగ్​ బి అమితాబ్​ బచ్చన్​ను​.. ఎన్నడూ చూడని విధంగా చూస్తారని అశ్వినీదత్ చెప్పారు. ఈ సినిమాను చూశాక.. అభిమానులు తప్పకుండా ఆశ్చర్యపోతారని చెప్పుకొచ్చారు. 2023 నాటికి షూటింగ్​ను పూర్తి చేసి అక్టోబర్​ 18న లేదా 2024 జనవరిలో రిలీజ్​ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news