BREAKING : ఉప్పల్ లో తండ్రి కొడుకులు దారుణ హత్య

-

BREAKING : ఉప్పల్ లో తండ్రి కొడుకులు దారుణ హత్య చోటు చేసుకుంది. ఉప్పల్ గాంధీ బొమ్మ వద్ద వెనకాల కాలనీలో (బ్రాహ్మణుల జంట హత్య) ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

మృతి చెందిన వారిని నరసింహ 78, శ్రీనివాస్ 35 లుగా పోలీసులు గుర్తించారు. కొందరు దుండగులు గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండగా అడ్డువచ్చాడు కొడుకు.

ఈ నేపథ్యంలోనే ఇద్దరినీ అత్యంత పాఠశావికంగా హత్య చేశారు దుండగులు. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమీపంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఇక హుటాహుటిన ఘనస్థలికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు.. ఈ కేసును విచారణ చేస్తున్నారు. హత్యకు గల కారణాలను సేకరించే పనిలో క్లూస్ టీమ్, స్థానిక పోలీసులు నిమగ్నమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news