తాగొద్దన్నందుకు తండ్రికి వీడియో కాల్ చేసి కొడుకు ఆత్మహత్య

-

మద్యం తాగొద్దన్నందుకు కన్న తండ్రికి వీడియో కాల్ చేసి కొడుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కొత్తగూడ మండల కేంద్రంలో నివాసం ఉండే లింగయ్య, కనకమ్మ దంపతులకు గ్రామాల్లో తిరుగుతూ వంట సామగ్రి అమ్ముకొనే జీవించేవాడు. తల్లిదండ్రులకు రెండో కొడుకు సంతోష్(20) చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. గత కొంత కాలంగా అతను మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి వస్తుండటంతో సంతోష్‌ను తల్లిదండ్రులు మందలించారు. అలవాటు మార్చుకోవాలని తీవ్రంగా హెచ్చరించడంతో సంతోష్ స్వగ్రామం కేశవపూర్‌కు వెళ్లారు. శుక్రవారం ఉదయం 8గంటలకు తండ్రికి వీడియో కాల్ చేశాడు. నా గురించి ఆలోచికండి, నేను చచ్చిపోతున్నా అని చెప్పి తండ్రి చూస్తుండగానే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఫోన్ కట్ చేసిన లింగయ్య ఇంటి పక్కవారికి సమాచారం అందించాడు. కానీ, అప్పటికే సంతోష్ మృతిచెందాడు.

crime

Read more RELATED
Recommended to you

Latest news