అమానుషం: గర్భవతని కూడా చూడకుండా రెచ్చిపోయిన మృగాలు…!

-

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఎన్ని చట్టాలు తెచ్చినా వారి మూర్ఖత్వం మాత్రం మార్చుకోవడం లేదు కొంతమంది మృగాలు. తాజాగా నాగపూర్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. నాగపూర్ పట్టణంలో ఓ నిండు గర్భిణీ పై ముగ్గురు వ్యక్తులు పైశాచిక దాడికి పాల్పడ్డారు. మరో మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మను ఇవ్వాల్సిన మహిళపై దారుణానికి ఒడిగట్టారు దుర్మార్గులు.

rape
rape

సదరు ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి ఓ బిల్డింగ్ టెర్రస్ పైకి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో మహిళ మెడపై కత్తి పెట్టి మరి దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటన అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ సంఘటన నుండి కోలుకొని ఆమె తన బంధువుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందించింది  సదరు మహిళ. పోలీసులు సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బాధితురాలు దగ్గర నుండి సేకరించి ఆ వివరాలతో ఆ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news