మరో మూడు నెలలు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు..!

-

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకంలోని ఉజ్వల స్కీమ్ లో ఉన్న 8 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సిలిండర్లు పథకం జూన్‌తో ముగిసింది. అయితే కరోనా వైరస్ సంక్షోభం ఇంకా కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను పొడిగించింది. మరో మూడు నెలలు ఉచితంగా సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ఉచిత సిలిండర్ల పథకాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. అయితే ఇప్పటికే దీపావళి వరకు రేషన్ ఫ్రీగా ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు సిలిండర్ కూడా ఉచితంగా ఇవ్వడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news