హేమంత్ హత్యకు 10 లక్షల కాంట్రాక్ట్…!

-

కిరాయి హంతకులతో హేమంత్ ని అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి చంపించారు అని పోలీసులు వెల్లడించారు. హత్యా కేసులో నిందితులు అందరూ అరెస్ట్ అయ్యారు. హేమంత్ ని చంపడానికి మేనమామ యుగంధర్ రెడ్డి పది లక్షలు సుపారి ఇచ్చారు. చందా నగర్ కు చెందిన కిరాయి హంతకులతో ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ హత్యలో కొందరు మహిళలు కూడా నిందితులుగా ఉన్నారు.

హేమంత్ తోనే ఉంటాను అని అవంతిక పోలీసుల కౌన్సెలింగ్ లో చెప్పింది అని పోలీసులు వివరించారు. ఈ హత్యా కేసులో ప్రధాన నిందితుడి తో పాటుగా మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా అతనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ కేసులో ఇంకా ఎవరు అయినా ఉన్నారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు అడ్వాన్స్ గా 7 లక్షలు ఇచ్చారట.

Read more RELATED
Recommended to you

Latest news