ప్రేమపెళ్లి చేసుకున్న 20 రోజులకే సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి.. ఏం జ‌రిగిందంటే..?

-

హైదరాబాద్ లోని సనత్ నగర్ లో కొత్తగా పెళ్లి అయిన యువతి అనుమానాస్పదంగా మృతి చెంద‌డంతో క‌ల‌క‌లం రేపుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. సనత్‌నగర్‌లో ఉంటోన్న పూర్ణిమ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ.. ప్రేమించిన దాసరి కార్తీక్‌ను 20 రోజుల క్రితం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది. ఈ క్రమంలో పెళ్లై నెల రోజులు పూర్తి కాకుండానే పూర్ణిమ మృతి చెందటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

పూర్ణిమ పెళ్లి చేసుకున్న కార్తీక్ ఆమెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ.. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంతరం పీఎస్ ఎదుట ఆందోళన చేస్తూ..తమకు న్యాయం చేయమని తమ బిడ్డను చంపిన కార్తీక్ కు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news