భార్యకు దూరంగా భర్త.. మరో మహిళతో లాండ్జిలో శృంగారం..!

-

వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం బలిగొన్న సంఘటన చిత్తూరు నగరంలో గురువారం వెలుగుచూసింది. వన్ టౌన్ సీఐ నరసింహారాజు కథనం మేరకు పుంగనూరుకు చెందిన ఈశ్వర్ రెడ్డి(50) భార్యకు దూరంగా ఉంటున్నాడు. రెండేళ్లుగా చిత్తూరులో ఈయన కూరగాయలు, తినుబండారాలు విక్రయిస్తూ నివసిస్తున్నాడు.

ఈయనకు యాదమరికి చెందిన లలితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో బుధవారం వీరిద్దరూ సుందరయ్య వీధిలోని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. కొద్దిసేపు తర్వాత డబ్బులు విషయం వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఈశ్వర్ రెడ్డిని నెట్టేయడంతో తలకు తీవ్ర గాయమై అక్కడే మృతి చెందాడు.

దీంతో గురువారం ఉదయం లలిత గది తాళాలు వేసి రిసెప్షన్ లో ఇచ్చి వెళ్లిపోయింది. మధ్యాహ్నం లాడ్జిని శుభ్రం చేయడానికి సిబ్బంది గది తెరచి చూడగా ఈశ్వర్ రెడ్డి మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈశ్వర్ రెడ్డి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news