శ్రీకాకుళంలో ఒంటరి యువతిపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..

-

తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతపై గ్రామ వాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మందస పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటీకోటకు చెందిన దళిత యువతి (27) తల్లిదండ్రులు కొన్ని నెలల క్రితం మరణించారు.

నాటి నుంచి ఆమె మందస మండలంలో యాచిస్తూ జీవనం సాగిస్తోంది. రాత్రిపూట స్థానిక ఎంపీడీవో కార్యాలయ వరండాలో నిద్రిస్తోంది. దాదాపు నెలక్రితం అదే మండలంలోని జిల్లుండకు చెందిన గ్రామ వాలంటీరు కొనితి బాలకృష్ణ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో మంగళవారం మందస పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశామని, గురువారం నిందితుడిని అరెస్టు చేస్తామని ఎస్ఐ రవికుమార్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news