బీహార్.. ప్రేమ వ్యవహారంలో అబ్బాయిని చంపేసిన కుటుంబం.. ఇంటి ముందే దహన సంస్కారాలు.

-

బీహార్ లోని ముజఫర్ నగర్ లోని అబ్బాయి, తమ అమ్మాయిని ప్రేమించాడన్న ఉద్దేశ్యంతో చావబాది, చితక్కొట్టి, మర్మాంగాలపై బలంగా కొట్టి ఆస్పత్రి పాలు చేసారు. చికిత్స పొందుతున్న ఆ ఆబ్బాయి ఆస్పత్రిలోనే ప్రాణాలు వదిలాడు. ఈ నేపథ్యంలో అబ్బాయి కుటుంబం అమ్మాయి వాళ్ల ఇంటివద్దకు వచ్చి అక్కడే దహన సంస్కారాలు పూర్తి చేసారు. ఇంటి ఆవరణలో గుమ్మం ఎదురుగా చితి పేర్చి, దహన సంస్కారాలు చేసారు.

ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ ANI ప్రకటించింది. దహన సంస్కారాల వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసింది. అబ్బాయి మర్మాంగాలను కోసేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయంలో ప్రధాన నిందితుడిగా సుశాంత్ పాండే అను వ్యక్తితో పాటు మరో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేసారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఈ సంఘటన జరిగిందని ANI ప్రచురించింది.

Read more RELATED
Recommended to you

Latest news