ఏలూరు లో మహిళా దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా..?

-

సాధారణంగా భార్యభర్తల బంధం అనేది అన్ని బంధాల కన్నా చాలా గొప్పది అని చెబుతుంటారు పెద్దలు. ఏ బంధం అయినా మనకు తోడుగా ఉంటుంది. కానీ చివరి వరకు ఒకరి తోడు ఉండేది భార్య భర్తలే. అయితే దాంపత్య జీవితంలో ఇమడలేక కొన్ని జంటలు విడిపోతున్నాయి. మరికొందరూ వివాహేతర సంబంధాలను ఏర్పరచుకొని జీవితాలను నాశనం చేసుకోవడం కాదు.. ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు గా జరిగాయి.

అలాంటి ఘటనే ఒకటి తాజాగా ఏలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఏలూరు జిల్లాలోని పోలవరంలోని బాపూజీ కాలనీలో సంకురు బుజ్జమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. వివాహిత అయిన బుజ్జమ్మ కొన్ని కారణాలచేత గత 15 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ.. ఒంటరిగా నివసిస్తోంది. ఈ తరుణంలో షేక్ సుబాని అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఏమైందో ఏమో తెలియదు.. కానీ షేక్ సుభాని విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. నిందితుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు మాత్రం తెలియదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news