ప్రాణం తీసిన ఛాలెంజ్ ….! అసలు ఏం జరిగిందంటే….?

-

ఒక ఛాలెంజ్ యువకుడు ప్రాణాలు తీసింది. అయితే ఈ ఘటన నిర్మల్ జిల్లా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా లోని లక్ష్మణ చాంద మండలం చింతల చాంద కు చెందిన షేక్ కాజా రసూల్ భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నాడు. అయితే అసలు ఏం జరిగింది అంటే…? మామడ మండలం అనంత పేటలో కాజా రసూల్ మరో నలుగురు మిత్రులతో కలిసి సోమవారం నాడు పార్టీ చేసుకున్నాడు. అయితే అందులో భాగంగా ఓ ఫుల్ బాటిల్ ను ఐదుగురు కలిసి తాగారు. అయితే అదే సమయంలో మిత్రుల మధ్య వాగ్వాదం జరిగింది.

wine challenge
wine challenge

దీనితో వాళ్ళు ఛాలెంజ్ చేసుకున్నారు .వెంటనే దమ్ముంటే 20 నిమిషాల్లో ఫుల్ బాటిల్ కాళీ చేయాలి ఇలా చేస్తే రూ. ఇరవై వేలు బహుమతి ఇస్తామని మిత్రుడు రసూల్ కి చెప్పారు తక్షణమే రసూల్ ఈ పందానికి ఒప్పుకున్నాడు. దీనితో రసూల్ వాళ్ళు విసిరినా ఛాలెంజ్ ని స్వీకరించాడు. రసూల్ కోసం నాలుగు క్వాటర్ సీసాలు వాళ్ళు తెప్పించారు. మిత్రులు తెప్పించిన ఆ నాలుగు క్వార్టర్ సీసా లో రెండు క్వార్టర్ సీసాలు రసూల్ ఎంతో వేగంగా తాగేసాడు.

ఇంకా రెండు సీసాలు మిగిలినప్పుడు మూడు సీసా తాగే సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు రసూల్. అయితే ఆ తర్వాత వెంటనే అతని మిత్రులు రసూల్ ని ఆంబులెన్స్ లో ఎక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా రసూల్ మార్గం మధ్యలోనే మరణించాడు. మరణించిన రసూల్ ని స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కి తీసుకుని వెళ్లారు. అయితే రసూల్ మరణానికి కారణమైన స్నేహితులు రత్తయ్య, నాగూర్ భాష పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని సీఐ జీవన్ రెడ్డి. తెలిపారు. ఇలా ఛాలెంజ్ ఒక యువకుడి ప్రాణాలు తీసింది.

Read more RELATED
Recommended to you

Latest news