కూల్​డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారి

-

కూల్​డ్రింక్ అనుకుని ఐదేళ్ల చిన్నారి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలా ఓ పది ఆస్పత్రులు తిరిగినా చివరకు చిన్నారిని దక్కించుకోలేకపోయారు. ఈ విషాద ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన రాజేశ్​-లావణ్య దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె శాన్వి ఉన్నారు. ఐదేళ్ల శాన్వి.. ఓ ప్రైవేట్​ పాఠశాలలో ఎల్​కేజీ చదువుతోంది. నిన్న ఆదివారం కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంటి ఆవరణలోని ఓ​ బాటిల్​లో ఉన్న పురుగుల మందును కూల్​డ్రింక్​ అనుకుని తాగేసింది. తర్వాత ఇంటికి వచ్చిన చిన్నారి.. వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కాగజ్​నగర్​ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో మంచిర్యాలకు వెళ్లారు. అక్కడా చిన్నారిని చేర్చుకోకపోవడంతో సుమారు మరో 10 ఆసుపత్రులు తిరిగారు. అయినా ఒక్కరూ చిన్నారిని ఆసుపత్రిలో చేర్చుకోలేదు. చివరకు ఓ ఆసుపత్రిలో చూపించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.

Read more RELATED
Recommended to you

Latest news