బొగ్గు దొంగల ముఠా, జవాన్ల మధ్య కాల్పులు.. నలుగురు దుర్మరణం

-

ఝార్ఖండ్​ ధన్​బాద్ ​జిల్లాలోని బాఘ్మారా డుమ్రాలో సీఐఎస్ఎఫ్ పోలీసులు, బొగ్గు దొంగల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బొగ్గును దొంగిలించే నెపంతో దొంగల ముఠా డుమ్రాలోని కేకేసీ బీసీసీఎల్ రెండో బ్లాక్ వద్దకు వచ్చారని సీఐఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. బొగ్గును దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా.. వారిని హెచ్చరించినట్లు వెల్లడించాయి. అయినా వినకపోగా.. దొంగలు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారని చెప్పాయి. దీంతో జవాన్లు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారని సీఐఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.

ఈ పోరులో నలుగురు బుల్లెట్​ గాయాలతో మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షహీద్ నిర్మల్ మహతో బోధనాసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ఇద్దరి పరిస్థితి విషమించటం వల్ల వారిని రాంచీలో హాస్పిటల్​లో చేర్పించారు. ఈ ఘటన గురించి సీఐఎస్ఎఫ్ జవాన్ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఘటనా స్థలాన్ని పోలీసులు, సీఐఎస్ఎఫ్ జవాన్లు సీజ్ చేశారు.

4-killed-in-encounter-between-cisf-jawan-and-coal-thieves-in-dhanbad

Read more RELATED
Recommended to you

Latest news