హైదరాబాద్ లో దారుణ హత్య..భార్యను వేట కొడవళ్ళతో చంపిన భర్త!

-

గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణి దారుణహత్యకు గురైంది. వేటకొడవలితో నరికి చంపారు భర్త. ఈ ఘటన వివరాల్లోకి వెళితే….రాజమహేంద్రవరం కి చెందిన వెంకట రామకృష్ణ తన భార్య స్రవంతి తో కలిసి కొండాపూర్ లో నివాసం ఉంటున్నారు. వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా ఉండి చిన్నమ్మ కుమార్తె లక్ష్మి ప్రసన్నకు 2020లో శ్రీరామకృష్ణ తో వివాహం జరిపించాడు. కొంతకాలం పాటు సజావుగా సాగిన సంసారం లో కలతలు…మొదలయ్యాయి.

లక్ష్మీ ప్రసన్నకు అదనపు కట్నం తీసుకురావాలంటూ శారీరకంగా మానసికంగా శ్రీ రామకృష్ణ వేధిస్తుండడంతో గత ఏడాది పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. శ్రీరామకృష్ణ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో చందానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది భార్య లక్ష్మీ ప్రసన్న. అయితే పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి తన పరువు తీయడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…వెంకట్ రామకృష్ణ దంపతులు ఉండి చేయిస్తున్నారని వారిపై కక్ష పెంచుకున్నాడు శ్రీరామకృష్ణ….

 

ఈనెల 6న కొండపూర్ లో ఉంటున్న బామ్మర్ది ఇంటికి వేట కోడవలి తో వచ్చాడు శ్రీరామకృష్ణ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతి వేటకొడవలిని చూసి కేకలు వేసి బయటకు వేళ్లే ప్రయత్నం చేసింది స్రవంతి..నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె తల వెనుక భాగం భుజం మీద దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు శ్రీ రామకృష్ణ. ఇక గాయాలపాయలైన స్రవంతిని ఆసుపత్రికి తరలించగా అదే రోజు రాత్రి 11 గంటలకు మృతి….చెందింది. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు…నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్..కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news