పెంపుడు తండ్రితో కూతురుపై అత్యాచారం..ప్రెగ్నెన్సీ రాగానే తల్లి దారుణాలు !

-

తమిళనాడు ఈ రోడ్ లో దారుణం చోటు చేసుకుంది. కూతురుపై పెంపుడు తండ్రితో అత్యాచారం చేయించి కన్న కూతురు పిండం అమ్ముకుంటోంది ఓ తల్లి. మైనర్ బాలిక నుంచి లెక్కుకుమించిన సార్లు పిండం విక్రయించింది తల్లి. ఓ ముఠాతో కలిసి ఈ పని చేసింది. అయితే ఈ కేసులో తల్లి, పెంపుడు తండ్రి సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు.

అలాగే.. ఈరోడ్ లోని రెండు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు. కేరళ, ఆంధ్రాలో తిరుపతిలోని హాస్పటల్‌లో దర్యాప్తునకు ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. బాలికల నుంచి మూడేళ్లుగా పిండం సేకరించిన వ్యవహారంలో కేరళ, ఆంధ్రప్రదేశ్‌ లోని తిరుపతిలో దర్యాప్తు చేయడానికి తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయం తీసుకుంది. లైంగిక దాడి తట్టుకోలేక ఇంటి నుండి పారిపోయిన బాలిక.. నేరుగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో దీనిపై విచారణ చేసిన పోలీసులు.. అసలు గుట్టు బయట పెట్టారు. నిందితులను అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news