ఆడపిల్లలు పుట్టారని అమానుషం… భార్యను హత్య చేసిన ప్రబుద్ధుడు

-

తరాలు మారిన ఆడపిల్లలపై అమానుష ఘటనలు తగ్గడం లేదు. అన్నింటా సగం అని మనం చెప్పుకుంటున్నా కొన్నిసార్లు ఇటువంటి మాటలు నీటి మూటలుగానే కనిపిస్తున్నాయి. అమ్మ నుంచి అంతరిక్ష రంగాల వరకు మహిళలు దూసుకెళ్తున్న అమానుష ఘటనలు తగ్గడం లేదు. ఇప్పటికీ వెనుకబడిన సమాజాలలో ఆడపిల్లలను అలసత్వంగా చూస్తున్నారు. లింగవివక్షతను చూపిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో స్కానింగ్ చేయిస్తూన్నారు. ఒకవేళ ఆడపిల్ల అని తెలిస్తే వెంటనే అబార్షన్లు చేయిస్తున్నారు. కొన్నిసార్లు తల్లులను కూడా చంపెస్తున్నారు. మరోమారు ఇలాంటి ఘటనే గద్వాల జిల్లాలో పునరావ్రుతం అయింది. ఇక్కడ ఆడపిల్ల పుట్టిందనే కారణంగా సొంత భార్యనే కడతేర్చాడు ఓ కసాయి. వివరాల్లోకి వెళ్తే గద్వాలకు చెందిన వెంకటేష్ -పల్లవి భార్యభర్తలు. వరసగా మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భార్య పల్లవిని(28) గోంతునులిమి చంపాడని మ్రుతురాలి తల్లిదండ్రలు ఆరోపిస్తున్నారు. మ్రతురాలి డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసేందుకు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news