నకిలీ వైద్య దంపతులు.. పదేళ్లలో 4 వేల మందికి గర్భస్రావం చేశారు..!

-

పట్టణంలోని ఈశాన్య లింగం వద్ద ఉన్న ఓ మెడికల్ షాప్ నే గర్భస్త్రావాలకు వీళ్లు అడ్డాగా మార్చుకున్నారు. పెళ్లి కాని యువతులు, ఇతర మహిళలు తమకు గర్భం వద్దనుకుంటే వీళ్ల దగ్గరికి వెళ్లేవాళ్లు.

తమిళనాడులోని తిరువణ్ణామలైలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నకిలీ డాక్టర్ల ఉదంతం బయటికి వచ్చింది. నకిలీ వైద్య దంపతులు గత పదేళ్లుగా యువతులు, మహిళలు, కాలేజీ విద్యార్థినులు, బాలికలకు గర్భస్రావాలు చేస్తున్నారు. తిరువణ్ణామలై పట్టణంలోని కృష్ణానగర్ కు చెందిన ప్రభు, కవిత అనే దంపతులు.. గత పదేళ్ల కాలంలో ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మందికి గర్భస్రావం చేశారు.

fake doctors did abortion to four thousand people in tamilnadu

పట్టణంలోని ఈశాన్య లింగం వద్ద ఉన్న ఓ మెడికల్ షాప్ నే గర్భస్త్రావాలకు వీళ్లు అడ్డాగా మార్చుకున్నారు. పెళ్లి కాని యువతులు, ఇతర మహిళలు తమకు గర్భం వద్దనుకుంటే వీళ్ల దగ్గరికి వెళ్లేవాళ్లు.

వీళ్లు తెలిసీ తెలియని వైద్యం చేసి ఆ గర్భాన్ని పోగొట్టేవారు. అయతే.. జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకున్న ఓ గర్భిణీ.. మళ్లీ పరీక్షలు చేయించుకోవడానికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు… ఆ గర్భిణీ అడ్రస్ కనుక్కుని తనను కలిశారు. అయితే.. ఆ గర్భిణీ ఆ నకిలీ డాక్టర్ల వద్ద గర్భం తీయించుకుంది. దీంతో తీగ లాగితే డొంక కదిలింది. నకిలీ వైద్యులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news