కూతురిపై తండ్రి అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక

-

కన్నతండ్రే తన మైనర్ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడుతున్నాడన్న విషయం తెలిసి కూడా తల్లి మౌనం వహించింది. ఫలితంగా ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను తండ్రి ఓ కాలువలో విసిరేస్తుండగా గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. గట్టిగా నిలదీయగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఈ అమానవీయ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది.

పంజాబ్ జలంధర్‌లో లెదర్ కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు పుట్టిన బిడ్డను తండ్రి పారేస్తుండగా గమనించిన స్థానికులు బాలికను, ఆమె తండ్రిని నిలదీయగా అసలు విషయం బయట పెట్టారు.

“గత కొంత కాలంగా మా తండ్రి నాపై అత్యాచారం చేస్తున్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే మా అమ్మని, నన్నూ ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు” అని బాలిక తెలిపింది. మరోవైపు బాలిక తల్లి కూడా మాట్లాడుతూ.. ‘గత కొన్ని రోజులుగా నా భర్త డ్రగ్స్​కి బానిస అయ్యాడు. నా కూమారై జీవితాన్ని నాశనం చేశాడు. నా భర్తను కఠినంగా శిక్షించండి’ అని ఆమె కోరింది.

విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించి.. బాలికను, ఆమెకు పుట్టిన శిశువును ఆసుపత్రికి తరలించారు. అయితే, శిశువు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news