వీడేం తండ్రి రా బాబు, ముగ్గురు పిల్లలను చెరువులో ముంచి చంపేసాడు…!

-

కొంత మంది ఎందుకు పుడతారో తెలియదు, కనీస మానత్వం ఉండదు… ఎందుకు బతుకుతారో తెలియదు, ఎవరిని ఉద్దరించడానికి బతుకుతారో అర్ధం కాదు. భార్య మీద కోపం వచ్చింది అని మనిషి అనే విషయాన్ని కూడా మర్చిపోయి మృగం మాదిరి ప్రవర్తించాడు ఒక తండ్రి. పిల్లలను చెరువులో ముంచి చంపేసాడు. తెలంగాణాలోని కామారెడ్డి జిల్లా జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

బాన్సువాడలో పోలీసుల కథనం ప్రకారం చూస్తే… తాడ్కోల్‌ గ్రామానికి చెందిన ఫయాజ్‌ ఇంట్లో భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రతీ రోజు భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. జూదం అలవాటు ఉన్న అతను భార్యతో గొడవకు దిగాడు. ఆమెను డబ్బులు కావాలి అని డిమాండ్ చేసాడు. ఆమె డబ్బులు ఇవ్వలేదు… గొడవ అయిపోయింది అనుకున్నారు. ఇంతలో ముగ్గురు కూతుళ్లు అఫియా (10), మహీన్ (9), జియా( 7) కనపడలేదు.

బాలికల కోసం పోలీసులు వెతుకుతున్న తరుణంలో శుక్రవారం ఉదయం రాజారం దుబ్బ చెరువులో ముగ్గురి శవాలు కనపడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు అందరూ ఆ పిల్లల తండ్రి మీదే ఫిర్యాదు చేసారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఫయాజ్ పరారిలో ఉన్నట్టు సమాచారం. అతన్ని కాల్చి చంపాలి అంటున్నారు పలువురు.

Read more RELATED
Recommended to you

Latest news