గుంటురులో విషాదం.. చెరువులోకి కారు న‌లుగురు మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లోని గుంటురు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అదుపు త‌ప్పిన కారు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న న‌లుగురు మృతి చెందారు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటురు జిల్లాలో గ‌ల మంగ‌ళ‌గిరి మండ‌లం ఎర్ర‌బాలెం వ‌ద్ద చోటు చేసుకుంది. కృష్ణాయ పాలెంకు చెందిన శ్రీ‌నివాస్, న‌రేంద్ర కుమార్, సాయి, తేజ రాంజీ ఒకే కారులో ప్ర‌యాణిస్తున్నారు.

అయితే ఎర్ర‌బాలెం గ్రామం వ‌చ్చిన త‌ర్వాత కారు స్పీడ్ ఎక్కువగా ఉండ‌టంతో చెరువు వ‌ద్ద కారు అదుపు త‌ప్పింది. దీంతో కారు చెరువులోకి దూసుకు వెళ్లింది. గ‌మనించిన స్థానికులు చెరువులో ఉన్న కారు అద్ద‌లు ప‌గ‌ల కొట్టి ఆ న‌లుగురిని బ‌య‌టక తీశారు. అయితే అప్ప‌టికే శ్రీ‌నివాస్, న‌రేంద్ర‌, సాయి, తేజా రాంజీ అక్క‌డికక్క‌డే మృతి చెందారు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డం.. పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల కోసం ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news