హైదరాబాద్‌లో బిర్యానీ బిల్లు కట్టలేదని.. ఫ్రెండ్‌ని ఏం చేశారో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

-

హైదరాబాద్‌లో ఘోరం జ‌రిగింది. బిర్యానీ బిల్లు కట్టే విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. అది ఓ ఫ్రెండ్ ప్రాణాలు కోల్పోయేలా చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. హన్మకొండకు చెందిన అభిలాష్ (28) రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది నుంచి ముషీరాబాద్‌ డివిజన్‌ వైఎస్సార్‌ పార్కు దగ్గర అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన వంశీ, చందు, హరీశ్‌లతో స్నేహం ఏర్పడింది. ఈ నెల 24 రాత్రి నలుగురూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత నారాయణగూడలోని ఓ హోటల్‌కు వెళ్లి బిర్యానీ తిన్నారు.

అక్కడే అస‌లు గొడవ మొదలైంది. బిల్లు నువ్వు కట్టు అంటే.. నువ్వు చెల్లించు అంటూ వాళ్లలో వాళ్లే గొడవపడ్డారు. హోటల్ యాజమాన్యం క‌ల‌గ‌చేసుకోగా వివాదం సద్దుమణిగింది. ఇక నలుగురూ కలిసి వైఎస్సాఆర్‌ పార్కు దగ్గరకు వచ్చారు. అక్కడ మళ్లీ గొడవ పడ్డారు. ఈ క్రమంలో వంశీ అభిలాష్‌ని తోసేయడంతో పక్కనే ఉన్న రాయిపై పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంతకంతకూ అతని ఆరోగ్య పరిస్థితి విషమించ‌డంతో అభిలాష్ చనిపోయాడు. అభిలాష్ తండ్రి రమేశ్‌ ఇచ్చిన కంప్లైంట్‌తో మిగిలిన ముగ్గురును అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కేవ‌లం బిర్యానీ బ‌ల్లు కోసం ఓ నిండు ప్రాణాన్ని బ‌లి తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news