అతని టార్గెట్ చిన్న పిల్లలే, జైలు నుంచి బయటకు వచ్చి మరీ

-

జైలు నుంచి తప్పించుకున్న ఒక 40 ఏళ్ళ నిందితుడు ఆరేళ్ళ బాలికను హత్య చేసిన ఉదంతం ఇది. గుజరాత్ లోని జామ్నగర్‌ లోని లాల్పూర్ తాలూకాలోని కరేనా గ్రామంలో ఆగస్టు నెలలో 6 ఏళ్ల బాలికను హత్య చేసాడు. దోషిని విక్రమ్ అలియాస్ కలు దామోర్ గా గుర్తించారు. ఆగస్టు 13 న బాలిక వావాడి రోడ్‌లోని లేబర్ కాలనీలోని డామర్ గుడిసెలోకి వెళ్లి బాలికను రేప్ చేయడానికి ప్రయత్నం చేసాడు.

ఆమె ఎదవడంతో గొంతు కోసి తల మీద సుత్తితో కొత్త వెళ్ళిపోయాడు. 2002 లో అతను ఇద్దరు చిన్న పిల్లలను చంపగా 10 ఏళ్ళ చొప్పున జైలు శిక్ష విధించారు. ఇప్పుడు జైలు నుంచి తప్పించుకుని చిన్నారిని చంపాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అతను జైలు నుంచి తప్పించుకున్నాడు అని పోలీసులు గుర్తించారు. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నిందితుడి ఫోటోని షేర్ చేసారు అప్పుడు లాల్పూర్ తాలూకాలోని కరేనా గ్రామంలో దామర్ దాక్కున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news