పురుగుల మందు తాగి ప్రేమ జంట‌ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

-

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రేమ జంట పురుగుల మందు తాగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఒక‌రి త‌ర్వాత ఒకరు పురుగుల మందు తాగి ఆత్మ‌హత్య చేసుకున్నారు. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా లో అష్రాఫ్ ఒక యువ‌తి ఒక్కిరి నొకరు ప్రేమించుకున్నారు. అయితే నిన్న అష్రాఫ్ ముందు గా పురుగుల మందు తాగి ఆత్మ‌హత్య చేసుకున్నాడు. అష్రాఫ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌ర్వాత అత‌ని ప్రేయ‌సి కాలేజ్ లో ఉంది. అష్రాఫ్ ఆత్మ‌హ‌త్య గురించి ఆ యువ‌తి తెలుసుకుంది.

ప్రేమికుడి ఆత్మ హ‌త్య ను ఆ యువ‌తి జీర్ణించు కోలేక పోయింది. దీంతో ఆ యువ‌తి కూడా పురుగుల మందు తాగింది. అయితే యువ‌తి పురుగుల మందు తాగుతుండ‌గా చూసిన స్థానికులు ఆ యువ‌తి ని ఆస్పత్రి కి త‌ర‌లించారు. అయితే ఆ యువ‌తి అప్ప‌టి కే మ‌ర‌ణించింది. దీంతో రెండు కుటుంబాలలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. అయితే ఈ ప్రేమ జంట ఎందుకు ఆత్మ హ‌త్య చేసుకుందో వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news