లిఫ్ట్ కోసం బైక్​ను ఆపి ఇంజిక్షన్ ఇచ్చిన దుండగుడు.. అతను చనిపోగానే బైక్​తో పరార్

-

హత్యలు చేయడంలో కొందరు దుండగులు కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. అలాంటి ఘటనే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో చోటుచేసుకుంది. బైక్ లిఫ్టు కోసం ఓ ద్విచక్రవాహనదారుడిని ఆపిన వ్యక్తి కొంత దూరం వెళ్లగానే అతడికి ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఒక్కసారిగా బైకర్ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆ దుండగుడు బైక్​ను తీసుకుని అక్కణ్నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని జమాల్‌ తన భార్యకు ఫోన్‌లో తెలిపారు. అనంతరం ఆయన స్పృహ కోల్పోవడంతో అటుగా వచ్చిన వాహనదారులు 108లో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గంమధ్యలోనే జమాల్‌ మృతిచెందారు.

ఘటనాస్థలంలో ఇంజెక్షన్‌, సిరంజీ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ముదిగొండ ఆస్పత్రికి తరలించారు. మృతుడు షేక్ జమాల్ సాహెబ్(40) చింతకాని మండలం బొప్పారానికి చెందినవాడిగా గుర్తించారు. ఇటీవలే తన చిన్న కుమార్తెకు పెళ్లి చేసిన జమాల్.. కుమార్తె వద్ద ఉన్న భార్యను తీసుకురావడానికి వెళ్తుండగా ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news