Breaking : సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్ర‌మాదం

-

సికింద్రాబాద్ లోని రాణిగంజ్ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారు జామున ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. రాణిగంజ్ ఏరియాలో ఉన్న ఎల‌క్ట్రికల్ గోదాంలో భారీగా మంటలు వ‌చ్చాయి. దీంతో రాణిగంజ్ లో ద‌ట్టమైన పోగ వ్యాపించింది. స్థానికులు అగ్ని మాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. దీంతో అగ్పి మాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ ఇంజ‌న్ వాహానాల‌తో అగ్ని మాప‌క సిబ్బంది మంట‌లను అదుపులోకి తెచ్చారు.

అయితే ఈ అగ్ని ప్ర‌మాదంలో భారీ ఆస్థి న‌ష్టం వాటిల్లింది. కాగ ఎవ‌రికీ ఎలాంటి హ‌నీ జ‌ర‌గక పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. కాగ ఈ అగ్ని ప్ర‌మాదం షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్లే సంబ‌వించింద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. అలాగే ఈ అగ్ని ప్ర‌మాదం ఎలా సంబ‌వించిందో ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. కాగ షార్ట్ స‌ర్క్యూట్ ద్వారా నా.. లేదా ఎవ‌రైనా కావాల‌నే అగ్ని ప్ర‌మాదం జ‌రిగేలా ఇలా చేశారా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news