సంగారెడ్డిలో విషాదం..చెరువులో పడి తల్లి, కూతుళ్లు మృతి..బట్టలు ఉతకడానికి వెళ్లి !

-

సంగారెడ్డి జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పుర్ మండలం ఐలపూర్ చెరువులో తల్లీ, కూతురు గల్లంతు అయ్యారు. బట్టలు ఉతకడానికి వచ్చి తల్లి యాదమ్మ , కూతురు లావణ్య చెరువులో పడిపోయారు.

అయితే, ఈ సంఘటనలో కూతురి లావణ్య(15) మృతదేహం లభ్యం అయింది. అటు తల్లీ యాదమ్మ కోసం గాలింపు కోసం వెళ్లిన వ్యక్తి కూడా గల్లంతు అయ్యాడు. దీంతో ఘటన స్టలం లో వారి ఇద్దరి కోసం గాలిస్తున్నారు గ్రామస్థులు. గాలింపు కోసం వెళ్లిన వ్యక్తి కూడా మరణించి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news