BREAKING : నల్గొండలో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని మృతి..తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

-

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీకి చెందిన రమ్యతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు రైలు ఢీ కొని మృతి చెందారు. గుంటూరు జిల్లా నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా సోమవారం రాత్రి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో రమ్య (28),ఆమె పిల్లలు రిషిక్ రెడ్డి(8)’ హంసిక(6)లు మృతి చెందారు.

దీంతో వారి మృత దేహాలను సత్తెనపల్లి ఆస్పత్రి మార్చురీకి తరలించారు పోలీసులు. నడికూడ రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో తెల్లవారుజామున సత్తెనపల్లి కి రమ్య భర్త, కుటుంబ సభ్యులు వెళ్లారు. ఈ సంఘటన ప్రమాదమా…. ఆత్మహత్య నా… అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news