పట్టపగలు.. నడిరోడ్డుపై దారుణ హత్య.. గొడ్డలితో నరికి.. వీడియోలు

-

అచ్చం సినిమాల్లో క్రైమ్ సీన్లలో ఎలా జరుగుతుందో అచ్చం అలాగే హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ శివారు అత్తాపూర్ లో చోటు చేసుకున్నది. అందరు చూస్తుండగానే నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. రమేశ్ అనే వ్యక్తిని అత్తాపూర్ 143 పిల్లర్ వద్ద నలుగురు దుండగులు నడిరోడ్డుపైనే హత్య చేశారు. నలుగురిలో ఓ వ్యక్తి రమేశ్ ను అడ్డగించి గొడ్డలితో నరకగా.. మిగితా వాళ్లు కాపలాగా ఉన్నారు. కాగా ఈ ఘటనను అక్కడి స్థానికులు వీడియో తీసి వాట్సప్ లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియోలు వాట్సప్ లో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news