పీఎఫ్​ఐ కేసులో ఇప్పటివరకు ఎంతమంది అరెస్టయ్యారంటే..?

-

ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరణ, ముష్కరుల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ, నిషేధిత సంస్థల్లో చేరేలా ప్రజల్ని ప్రభావితం చేసేవారిని లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్​ఐ కార్యాలయాలపై ఎన్ఐఏ ముప్పేట దాడి చేసింది.

ఇప్పటి వరకు ఈ కేసులో 106 మందిని అరెస్టు చేశారు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్​, ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఎన్ఐఏ పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్​ చేపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్​ఐఏ భారీ స్థాయిలో సోదాలు జరపడం, అనేక మందిని అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

11 రాష్ట్రాల్లోని పీఎఫ్​ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేసింది ఎన్​ఐఏ. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ అరెస్టు చేసింది. ఇలా గురువారం ఒక్కరోజే కేరళలో(22), మహారాష్ట్ర, కర్ణాటకలో 20 చొప్పున, తమిళనాడులో (10), అసోంలో 9, ఉత్తర్​ప్రదేశ్​లో 8, ఆంధ్రప్రదేశ్​లో 5, మధ్యప్రదేశ్​లో 4, పుదుచ్చేరి, దిల్లీలో ముగ్గురు చొప్పున, రాజస్థాన్​లో ఇద్దరిని ఎన్​ఐఏ అరెస్టు చేసింది.
అయితే.. వారి వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించలేదు. పీఎఫ్​ఐ స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు వివరించింది. ఉగ్ర నిధులకు సంబంధించిన కేసుల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్, రాష్ట్రాల పోలీసులతో కలిసి ఈ అరెస్టులు చేసినట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news