ప్రిన్సిప‌ల్ దారుణం.. ప్రాక్టిక‌ల్స్ పేరు తో 17 మంది బాలిక‌ల‌పై..

-

ప్రాక్టికల్స్ పేరు తో ఒక స్కూల్ 17 మంది బాలిక‌లపై ప్రిన్సిప‌ల్ దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ లో చోటు చేసుకుంది. 10 వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న 17 మంది బాలిక‌ల‌ను ప‌రీక్ష‌ల పేరుతో పాఠ‌శాల కు ప్రిన్సిప‌ల్ పిలిచాడు. మ‌రుస‌టి రోజు సీబీఎస్ఈ ప్రాక్టిక‌ల్స్ ఉన్నాయ‌ని.. రాత్రి అంతా ఇక్క‌డే ఉండి చ‌దువు కోవాల‌ని సూచించాడు. వారికి భోజ‌నం ఏర్పాటు చేసి అందులో మ‌త్తు మందు క‌లిపాడు. వారు సృహా త‌ప్పిన త‌ర్వాత 17 మంది బాలిక‌ల పై ప్రిన్సిప‌ల్ తో పాటు మ‌రొక వ్య‌క్తి లైంగిక దాడి కి పాల్ప‌డ్డాడు.

ఈ ఘ‌ట‌న న‌వంబ‌ర్ 17 జ‌రిగింది. అయితే ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే.. ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ చేస్తామ‌ని బెదిరించారు. అయితే బాలిక‌లు త‌మ క‌టుంబ స‌భ్య‌లకు చెప్పారు. వారు పోలీసులు ఫీర్యాదు చేసినా.. ప‌ట్టించు కోలేక పోవ‌డంతో స్థానిక ఎమ్మెల్యే ప్ర‌మోద్ ఉత్వాల్ ను ఆశ్ర‌యించాగా.. ఈ విష‌యం వెలుగు లోకి వ‌చ్చింది. ఎమ్మెల్యే ఆదేశాల‌తో పోలీసులు ద‌ర్యాప్తు చేయ‌గా.. నిజం బ‌య‌ట ప‌డింది. దీంతో వారి పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే ఈ కేసు లో నిర్ల‌క్ష్యం వ‌హించిన పోలీసుల‌ను స‌స్పెండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news