BREAKING : బస్సులపైకి దూసుకెళ్లిన వాహనాలు.. 20 మంది దుర్మరణం

-

నైజీరియా లాగోస్​లో రెండు వేర్వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల సహా 9 మంది దుర్మరణం చెందారు. మరో ఘటనలో 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

నైజీరియాలోని ఓజులెగ్బా ప్రాంతంలో రద్దీగా ఉండే వంతెన వద్ద బస్సుపైకి ఓ భారీ కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు ఎక్కుతున్న ఇద్దరు చిన్నారులు సహా 9 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ సురక్షితంగా బయటపడింది.

మరో ఘటనలో ఒండో రాష్ట్రంలోని ఒడిగ్బో కౌన్సిల్ ప్రాంతంలో మరో ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news