ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..డివైడర్ ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా

-

 

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై డివైడర్ ఢీకొని ఆర్టీసీ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన ప్రయాణికులను హుటాహుటిన తుని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి పార్వతిపురం వెళ్ళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సు లో సుమారు 20 మంది ప్రయాణికులు . ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఏవరికి ఎటువంటి ప్రాణప్రాయంలేదని డాక్టర్లు చెప్పుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news