చికెన్ గొడవ… తండ్రిని చంపేసిన కొడుకు…!

-

తండ్రి మద్యం తాగి వచ్చి పిల్లలను కొట్టడం అనేది మనం ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటా౦ చూస్తూనే ఉంటాం. మన ఇంటి పక్కన కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇదే ఒక తండ్రి ప్రాణం తీసింది. తండ్రి వేధింపులకు గురి చేయడంతో కొడుకు తండ్రిని చంపేసాడు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సయ్యద్ మదార్ బండరాయి కొడుతూ జీవనం సాగిస్తున్నాడు.

కొడుకు కూడా తండ్రికి ఆసరాగా ఉంటున్నాడు. అయితే నిత్యం తండ్రి వచ్చి పిల్లలను బెదిరిస్తున్నాడు. తాగి వచ్చి చంపేస్తా అని బెదిరించడంతో పాటుగా వాళ్ళను హింసిస్తున్నాడు. ఈ నేపధ్యంలో పీకల వరకు తాగి ఇంటికి వచ్చిన మదార్… చికెన్ వండిపెట్టాలని కొడుకుని డిమాండ్ చేసాడు. కుదరదని కొడుకు చెప్పగా కుమారుడు కాశీం తో గొడవకు దిగాడు తండ్రి మదార్…

దీనితో ఆ గొడవ చినికి చినికి గాలి వానగా మారింది. తమను తాగి వచ్చి వేధిస్తున్న తండ్రిని ఏ విధంగా అయినా చంపాలని ఖాసీం భావించి తండ్రి నిద్రపోతున్న సమయంలో తండ్రి తలపై బండరాయితో మోది హత్యా చేసాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కొడుకు ఖాసీం ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ప్రాణ భయంతోనే ఖాసీం తండ్రిని హతమార్చినట్టు స్థానికులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news