త‌న పిల్ల‌ల‌నే హ‌త్య చేసిన సీఐఎస్ఎఫ్ జ‌వాన్ ఆత్మ‌హ‌త్య

-

సీఐఎస్ఎఫ్ జ‌వాన్ రామ్ కుమార్ త‌న సొంత పిల్ల‌ల‌నే బావిలో తోసి చంపేసిన ఘ‌ట‌న ఈ రోజు ఉద‌యం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో జ‌రిగిన విషాదాక‌ర ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే పిల్ల‌ల‌ను హ‌త్య చేసిన సీఐఎస్ఎఫ్ జ‌వాన్ రామ్ కుమార్ కాసేప‌టి క్రితం ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ రోజు సాయంత్రం అనంతారం శివారు లో రైలు కింద ప‌డి జ‌వాన్ రామ్ కుమార్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు రామ్ కుమార్ కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు.

దీంతో రామ్ కుమార్ భార్య, అత‌ని సోద‌రుడు మృత దేహాన్ని గుర్తు పట్టారు. కాగ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని గ‌డ్డిగూడెం తండాలో నివాసం ఉంటున్న రామ్ కుమార్ ముంబై లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా ప‌ని చేస్తున్నాడు. అయితే ఇటీవ‌ల సంక్రాంతి సంద‌ర్భంగా మూడు రోజుల క్రితం సెల‌వుల‌తో ఇంటికి వ‌చ్చాడు. అయితే త‌న భార్య‌తో గొడ‌వ ప‌డ్డ రామ్ కుమార్ ఈ రోజు ఉద‌యం త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను బావిలో తోసి హ‌త్య చేశాడు. అనంత‌రం ఈ రోజు సాయంత్రం రైలు ప‌ట్టాల కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news