బాలికపై అత్యాచారం కేసులో మాజీ టీఆర్ఎస్ నేత అరెస్ట్..

-

ఇటీవల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ టీఆర్ఎస్ పార్టీ మాజీ నేత, నిర్మల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ బాలికపై టీఆర్ఎస్ నాయకుడు అత్యాచారానికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. తాజాగా ఈరోజు ఆయనను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని కారు డ్రైవర్ జాఫర్ తో పాటు మధ్యవర్తి అనురాధను కూడా అదుపులోకి తీసుకున్నారు. తమ కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లి ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాజిద్ పై పోక్సోతో పాటు, అపహరణ, అత్యాచారం కేసులను నమోదు చేశారు.

బాధ్యయుతమైన పదవిలో ఉండీ.. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డాడంటూ అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ కూడా దిద్దుబాటు చర్యలు తీసుకుంది. నిందితుడు సాజిద్ ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అతని ప్రాథమిక సభ్యత్వాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రద్దు చేసినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news